Tue May 07 2024 05:45:34 GMT+0000 (Coordinated Universal Time)
రికవరీ చేయొద్దు.. పీఆర్సీపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ఉద్యోగుల పీఆర్సీ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది.
ఉద్యోగుల పీఆర్సీ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. జీవోలో పేర్కొన్నట్లుగా రికవరీలు లేకుండా జీతాలు చెల్లించాలని హైకోర్టు ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీతాల్లో రికవరీ చేయం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడింది.
ఈనెల 23వ తేదీకి....
అయితే రికవరీ చేయకుండానే జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వ తరుపున న్యాయవాది తెలిపారు. సమగ్ర కౌంటర్ ను దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.
- Tags
- high court
- prc
Next Story