Fri Dec 05 2025 13:28:46 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో కరోనాతో ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 165 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 165 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,77,486 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,497 మంది మరణించారు.
పెరుగుతున్న యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,61,729 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 1,260 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,13,82,067 నమూనాలను పరీక్షించారు
Next Story

