Fri Dec 05 2025 23:17:46 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఒక్కరోజే 10 ఒమిక్రాన్ కేసులు
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 162 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 162 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్కరోజే ఏపీలో పది ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16కు చేరుకుంది. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,76,849 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,492 మంది మరణించారు.
యాక్టివ్ కేసుల సంఖ్య....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,61,308 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 1,049 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,12,62,099 నమూనాలను పరీక్షించారు
Next Story

