Thu Jan 29 2026 17:19:47 GMT+0000 (Coordinated Universal Time)
23న విశాఖకు జగన్.. ముహూర్తం ఖరారయినట్లే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ పరిపాలనకు ముహూర్తం ఖరారయింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ పరిపాలనకు ముహూర్తం ఖరారయింది. అక్టోబరు 23వ తేదీన జగన్ విశాఖ నుంచి పాలన ప్రారంభించనున్నారు. విశాఖలో ఇప్పటికే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. రుషికొండలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని నాలుగు బ్లాక్లలో నిర్మిస్తున్నారు. ఇందులో ఒక బ్లాక్ ను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా వినియోగిస్తారు.
క్యాంప్ కార్యాలయాన్ని...
ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వచ్చే నెల మూడో వారంలోగా ఆ బ్లాక్ ను సెక్యూరిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. అక్టోబరు 23వ తేదీ నుంచి జగన్ విశాఖ నుంచి పాలన ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ దసరా నుంచి పాలనను విశాఖ నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story

