Tue Mar 31 2026 06:04:32 GMT+0530 (India Standard Time)
15న కడపలో స్టీల్ఫ్యాక్టరీ శంకుస్థాపన
ఈనెల 15 న వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు

ఈనెల 15 న వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంఖుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు వెల్లడించారు. జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీకి స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
త్వరితగతిన పనులు...
అయితే దీని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈ నెల 15న పూర్తి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా త్వరితగతిన ఫ్యాక్టరీ పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story

