Fri Jan 30 2026 12:29:16 GMT+0000 (Coordinated Universal Time)
నేడు విశాఖకు జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవంలో జగన్ పాల్గొననున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవంలో జగన్ పాల్గొననున్నారు. ఉదయం 10.15 గంటలకు జగన్ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు.
రెండు గంటల పాటు....
విశాఖ ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన శారదాపీఠం చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. దాదాపు రెండున్నర గంటల పాటు జగన్ ఆశ్రమంలో గడుపుతారు. అనంతరం బయలుదేరి తాడేపల్లికి చేరుకోనున్నారు.
Next Story

