Tue Mar 17 2026 07:11:42 GMT+0530 (India Standard Time)
నేడు చిలకలూరిపేటకు జగన్
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని ప్రారంభిస్తారు

ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆయన ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని ప్రారంభించనున్నారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఆయన పర్యటించనున్నారు. భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
జగన్ పాల్గొనే...
ముఖ్యమంత్రి జగన్ పాల్గొనే ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేతలు కూడా పెద్దయెత్తున జనసమీకరణ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు, మంత్రులు, వైద్యశాఖాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Next Story

