Sun Feb 01 2026 21:36:29 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కావలికి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన కావలికి రానున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన కావలికి రానున్నారు. కావలిలో జరిగే వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుమారుడు వివాహ రిసెప్షన్ కు ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి.
వివాహ వేడుకలో...
ముఖ్యమంత్రి జగన్ సాయంత్రం 4.30 నిమిషాలకు కావలి చేరుకోనున్నారు. వివాహ వేడుకలో పాల్గొన్న అనంతరం తిరిగి సాయంత్రం ఐదు గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. కావలిలో ముఖ్యమంత్రి రాక సందర్భంగా భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.
Next Story

