Wed Jan 28 2026 21:57:46 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తల్లుల ఖాతాల్లో జగన్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విద్యార్థులకు తీపి కబురు చెప్పనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విద్యార్థులకు తీపి కబురు చెప్పనున్నారు. జగనన్న విద్యాదీవెన కింద ఈరోజు 686 కోట్లు చెల్లించనున్నారు. ఈ ఏడాది మూడో విడత కింద 11.03 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఈ పథకం కింద లబ్దిపొందనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ ఈ పథకం కింద నగదును తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
మూడో విడత....
కరోనా సమయంలోనూ జగన్ సంక్షేమ పథకాలను ఆపలేదు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని జగనన్న విద్యాదీవెన గా మార్చారు. ఇప్పటి వరకూ ఈ రెండున్నరేళ్లలో ఈ పథకం 6,259 కోట్లను జగన్ ప్రభుత్వం చెల్లించింది. ప్రతి మూడు నెలలకొకసారి ఈ పథకం కింద విద్యార్థి చెల్లించాల్సిన ఫీజును చెల్లిస్తారు.
Next Story

