Mon Dec 15 2025 20:09:29 GMT+0000 (Coordinated Universal Time)
మూడేళ్ల తర్వాత ఎమ్మెల్యేలతో జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. వైఎస్సార్ సీఎల్పీ సమావేశం త్వరలోనే జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. వైఎస్సార్ సీఎల్పీ సమావేశం త్వరలోనే జరగనుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే 2019లో వైఎస్సార్ సీఎల్పీ సమావేశం జరిగింది. ఆ తర్వాత ఎటువంటి సమావేశం జరగలేదు. అయితే ఎన్నికలు రెండేళ్లు మాత్రమే ఉన్నందున ఎమ్మెల్యేలతో ముఖాముఖీ మాట్లాడేందుకు, వారికి దిశానిర్దేశం చేసేందుకు వైఎస్సార్ సీఎల్పీ సమావేశం నిర్వహించాలని జగన్ నిర్ణయించారు.
కొత్త జిల్లాల...
కేబినెట్ సమావేశంలో వైఎస్ జగన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇక రెండేళ్లు మాత్రమే ఎన్నికలు ఉన్నందున ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాల్లోనే ఉండి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా యత్నించాలని కోరారు. కొత్త జిల్లాల ఏర్పాటు, వస్తున్న అభ్యంతరాలపై కూడా జగన్ ఎమ్మెల్యేలతతో చర్చించనున్నారు.
Next Story

