Thu May 16 2024 16:21:25 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ను కలసిన త్రిదండి చినజీయర్ స్వామి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను త్రిదండి చినజీయర్ స్వామి కలిశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను త్రిదండి చినజీయర్ స్వామి కలిశారు. ఆయనను ముచ్చింతల్ ఆశ్రమంలో జరగనున్న సహస్రాబ్ది ఉత్సవాలకు చినజీయర్ స్వామి ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను జగన్ కు అందచేశారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి జగన్ కు ఆశీస్సులు అందజేశారు.
సహస్రాబ్ది ఉత్సవాలకు....
వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ముచ్చింతల్ లోని చినజీయర్ ఆవ్రమంలో రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా సహస్రాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ప్రధాని, అమిత్ షా వంటి వారిని చినజీయర్ స్వామి ఆహ్వానించారు. జగన్ ను కూడా హాజరు కవాలని కోరారు.
Next Story