Sat Jul 27 2024 01:37:48 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : శారదాపీఠంలో వైఎస్ జగన్.. రాజశ్యామల అమ్మవారికి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ విశాఖకు చేరుకున్నారు. చినముష్టివాడలోని శారదపీఠంలో ఆయనకు సాదర స్వాగతం లభించింది
![Ys Jagan : శారదాపీఠంలో వైఎస్ జగన్.. రాజశ్యామల అమ్మవారికి Ys Jagan : శారదాపీఠంలో వైఎస్ జగన్.. రాజశ్యామల అమ్మవారికి](https://www.telugupost.com/h-upload/2024/02/21/1592412-jagan.webp)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ విశాఖకు చేరుకున్నారు. చినముష్టివాడలోని శారదపీఠంలో ఆయనకు సాదర స్వాగతం లభించింది. శ్రీ రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్న జగన్ ప్రత్యేక పూజలను నిర్వహించారు. రాజశ్యామల అమ్మవారి దీక్షాపీఠం వద్ద జరిగిన పూజలో ఆయన పాల్గొన్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన రాజశ్యామల అమ్మవారి పూజలు చేయడం విశేషం
విశాఖకు చేరుకున్న...
. జగన్ కు శారదాపీఠంలో స్వామి స్వరూపానందేంద్ర స్వామితో కలసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత ఆయన తిరిగి తాడేపల్లి బయలుదేరి వెళ్లనున్నారు. రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. జగన్ పర్యటన సందర్భంగా చిన ముష్టివాడలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story