Mon Feb 02 2026 05:04:41 GMT+0000 (Coordinated Universal Time)
పంప్ హౌస్ ప్రారంభం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. కర్నూలు జిల్లా లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ను జగన్ ప్రారంభించారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. కర్నూలు జిల్లా లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ను జగన్ ప్రారంభించారు. ఈ పంప్ హౌస్ ద్వారా నాలుగు నియోజకవర్గాలకు సాగు, తాగు నీరు అందనుంది. 10,394 ఎకరాలకు సాగునీరు అందుతుందని అధికారులు వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వెంట రాగా పంప్ హౌస్ ను ప్రారంభించి దిగువకు జగన్ నీటిని విడుదల చేశారు.
నాలుగు నియోజకవర్గాలకు...
ఈ నీరు డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల ప్రజలకు తాగునీరు కూడా అందుతుందని తెలిపారు. ఈ పంప్ హౌస్ ద్వారా విడుదలయి నీరు నాలుగు నియోజకవర్గాల్లో 77 చెరువులకు ఎత్తిపోసే ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు జగన్. ఆంకొండలో మోటార్ స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హర్షధ్వనాల మధ్య జగన్ నీటిని విడుదల చేశారు.
Next Story

