Fri Dec 05 2025 19:13:04 GMT+0000 (Coordinated Universal Time)
తాడేపల్లి చేరుకున్న జగన్
పారిస్ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు

పారిస్ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కుమార్తె హర్షా రెడ్డి కాన్వకేషన్ కు సతీసమేతంగా పారిస్ వెళ్లిన జగన్ తిరగి కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. ఆయన నేరుగా గన్నవరం నుంచి తాడేపల్లికి బయలుదేరి వెళ్లిపోయారు.
విమానాశ్రయంలో...
గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జగన్ కు మంత్రి జోగి రమేష్ స్వాగతం పలికారు. ఆయన వెంట చీఫ్ సెక్రటరీ సమీర్శర్మతో పాటు ఎమ్మెల్సీ తలశిల రఘురాం కూడా ఉన్నారు.
Next Story

