Sat Dec 06 2025 10:46:54 GMT+0000 (Coordinated Universal Time)
మరికాసేపట్లో తిరుపతికి జగన్
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరికాసేపట్లో తిరుపతికి చేరుకోనున్నారు. ఆయన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరికాసేపట్లో తిరుపతికి చేరుకోనున్నారు. ఆయన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్నారు. తిరుపతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం జరగనుంది. రాత్రి 7.30 గంటల వరకూ ఈ సమావేశం జరగనుంది. దాదాపు 68 అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి.
హోదా విషయంలో....
సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో జగన్ స్వాగతోపన్యాసం చేయనున్నారు. ఈ సమావేశంలో తెలంాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో ఆంధప్రదేశ్ కు ఎదురవుతున్న సమస్యలను జగన్ ప్రస్తావించనున్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని కూడా జగన్ ప్రముఖంగా ప్రస్తావిస్తారు.
Next Story

