Mon Dec 08 2025 10:53:30 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఢిల్లీకి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. ఆయన ఢిల్లీలో రెండు రోజుల పాటు ఉంటారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. ఆయన ఢిల్లీలో రెండు రోజుల పాటు ఉంటారు. ఈరోజు రాత్రికి జన్పథ్ వన్ లోని నివాసంలో ఉంటారు. రేపు వామపక్ష తీవ్రవాదంపై ప్రభుత్వం నిర్వహించే సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారని సీఎంవో కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
కేంద్రం పెద్దలతో...
జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశాలున్నాయి. రాష్ట్ర అభివృద్ధితో పాటు వివిధ రాజకీయ అంశాలపై వారితో చర్చించే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఖరారు కావడంతో జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story

