Fri Mar 20 2026 16:50:26 GMT+0530 (India Standard Time)
వంద వాహనాలకు జెండా ఊపి
వంద వాహనాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు.

వంద వాహనాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు. స్వచ్ఛత ఉద్యమి యోజన పథకం కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు100 మురుగు శుద్ది వాహనములను జగన్ ఈ కార్యక్రమంలో అందచేశారు. తాడేపల్లి క్యాంప్ క్యారాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
మురుగు శుద్ధి వాహనాలను...
ముఖ్యమంత్రి జగన్ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Next Story

