Fri Dec 05 2025 12:47:35 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు గుంటూరుకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. సచివాలయంలో సమీక్షలతో పాటు గుంటూరులో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఉదయం 11.10 గంటలకు ఉండవల్లి నుంచి చంద్రబాబు నేరుగా గుంటూరు వెళ్తారు.
బడ్జెట్ పై సమీక్ష...
ఉదయం 11.30 కిమ్స్ శిఖర ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.35 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు గంటలకు బడ్జెట్ పై అధికారులతో సమీక్ష చేస్తారు. ఏ శాఖలకు ఎంత నిధులు కేటాయించాలన్న దానిపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

