Thu Mar 19 2026 05:35:02 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు బనకచర్లపై చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను నేడు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను నేడు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. నేడు ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. బనక చర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా తీసుకోవడంతో దీనిపై చర్చించనున్నారు.
పోలవరంపై కూడా...
మరోవైపు పోలవరం ప్రాజెక్టుపై కూడా సమీక్ష చేయనున్నారు. పోలవరం నిర్మణ పనుల పురోగతి పై కూడా చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుుడు ఉదయం 11.15 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం పన్నెండు గంటలకు నీతి అయోగ్ సమావేశంలో పాల్గొంటారు.
Next Story

