Tue Jan 20 2026 03:11:34 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు కర్నూలు జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను చంద్రబాబు అందచేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.
ఓర్వకల్లులో...
ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఇంటికి వెళ్లి మరీ చంద్రబాబు పింఛనును గత రెండు నెలల నుంచి ఇస్తున్నారు. ఓర్వకల్లులో చంద్రబాబు పర్యటన సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముంది.
Next Story

