Thu Mar 19 2026 15:05:03 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు చంద్రబాబు సమీక్ష చేసే శాఖలివే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు వివిధ శాఖలను సమీక్ష చేయనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు వివిధ శాఖలను సమీక్ష చేయనున్నారు. సచివాలయంలో జరగనున్న ఈ సమీక్షలకు మంత్రులతో పాటు ఆ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా హాజరు కానున్నారు. చంద్రబాబు వరసగా శాఖల వారీగా సమీక్షలను నిర్వహిస్తూ గత ప్రభుత్వంలో జరిగిన లోటు పాట్లతో పాటు ప్రస్తుత పరిస్థితిపై ఆయన అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.
సాయంత్రం వరకూ...
ఈరోజు సాయంత్రం వరకూ చంద్రబాబు వివిధ మంత్రిత్వ శాఖలపై సమీక్షను జరపనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈరోజు గిరిజన, సాంఘిక సంక్షేమ శాక, మహిళ సంక్షేమ శాఖలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని వివరాలతో సమావేశాలకు రావాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.
Next Story

