Sun Dec 21 2025 06:53:41 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు ఢిల్లీ బాబు బాగా బిజీ...కేంద్ర మంత్రులతో సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ నెల 3వ తేదీ రాత్రికి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నాయుడు నిన్న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయనకు వివరించి తగిన సహకారం అందించాలని కోరారు. నిన్న పియూష్ గోయల్. నితిన్ గడ్కరీలతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు.
సాయంత్రం హైదరాబాద్ కు...
ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు నీతి అయోగ్ సీఈవోతో సమావేశం కానున్నారు. పది గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. 1045 గంటలకు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. ఉదయం 11.30 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ తో సమావేశమై రాష్ట్రానికి సహకారం అందించాలని కోరనున్నారు. సాయంత్రం ఆయన బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Next Story

