Wed Dec 17 2025 23:33:25 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : వారికి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు.. నెలకు పదివేలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. కీలక నిర్ణయం తీసుకున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. కీలక నిర్ణయం తీసుకున్నారు. మసీదుల్లో పనిచేసే ఇంజమా్ లకు, మౌజామ్ లకు గౌరవ వేతనం కింద పదివేలు ఇవ్వాలని నిర్ణయించారు. నెలకు ఐదు వేల రూపాయలు ఆదాయం లేని వారికి పది వేలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇమామ్ ల గౌరవ వేతనం పది వేలు, మౌజాన్ల గౌరవ వేతనం ఐదు వేల చొప్పున కొనసాగించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ గౌరవ వేతనాలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఏటా అరవై కోట్లు...
అయితే వీరందరి జీతాల కోసం ప్రభుత్వం ఏటా 90 కోట్ల రూపాయలు వెచ్చిస్తుందని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు.ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ముఖ్యమంత్రి చంద్రబాబును అమరావతిలో సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వక్ఫ్బోర్డు నిర్వహణతో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అజీజ్కు సూచించారు ప్రభుత్వ నిర్ణయంతో ఇంజమ్ లు, మౌజామ్ లకు గౌరవ వేతనం కొనసాగించడం పట్ల ముస్లిం నేతలు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

