Fri Feb 14 2025 18:34:04 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బ్యాంకర్లతో చంద్రబాబు భేటీ.. రైతులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు స్టేట్ లెవెల్ బ్యాంకర్ల సమావేశంలో పాల్గొనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు స్టేట్ లెవెల్ బ్యాంకర్ల సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకర్లకు పలు సూచనలు చేయనున్నారు. త్వరలో ఏపీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం పథకాన్ని ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
వందనం కూడా...
రైతులకు రుణాలను ఇచ్చే విషయంపై కూడా బ్యాంకర్లకు చంద్రబాబు సూచనలు చేయనున్నారు. అలాగే త్వరలో తల్లికి వందనం పథకం కూడా అమలు చేయనుండటంతో దీనికి సంబంధించిన వివరాలను కూడా బ్యాంకర్లతో చర్చించనున్నారు. దీంతో ఈ రెండు పథకాలను ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుండటంతో నేడు జరిగే బ్యాంకర్ల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story