Fri Dec 05 2025 16:39:44 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ఈదుపురం గ్రామంలో ఒకఇంటికి వెళ్లిన చంద్రబాబు దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. స్వయంగా టీ కాచి చంద్రబాబు దానిని తాగారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని...
వారికి రాష్ట్రప్రభుత్వం నుంచి ఏ ఏ పథకాలు అందుతున్నాయో వివరించారు. చంద్రబాబు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసి దానితో టీ పెట్టుకుని స్వయంగా తాగి పక్కన ఉన్న నేతలకు కూడా ఆ టీ ని అందించారు. చంద్రబాబు నాయుడు పక్కన పౌరసరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులతో కాసేప మాట్లాడారు. కుశల ప్రశ్నలు వేశారు. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడులు కూడా ఉన్నారు.
Next Story

