Tue Feb 03 2026 08:27:35 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : రేపు ఏపీ కేబినెట్ భేటీ
రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది.

రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. అయితే తొలిసారిగా ఈ కేబినెట్ ను నిర్వహించనున్నారు. 2014 -19 మధ్య కాలంలో ఈ కేబినెట్ ను అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేబినెట్ పై మంత్రుల కార్యదర్శులకు శిక్షణ ఇచ్చింది.
పేపర్ లెస్ కేబినెట్...
ఈ కేబినెట్ వల్ల ఉపయోగాలను తెలుపుతూ మంత్రుల కార్యదర్శులకు జీఏడీ అధికారులు తెలిపారు. పూర్తిగా పేపర్ లెస్ కేబినెట్ ను నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించి మంత్రులందరికీ ట్యాబ్లను పంపిణీ చేశారు. అయితే రేపటి సమావేశంలో ఏపీ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
Next Story

