Fri Dec 05 2025 14:57:30 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : మహిళ దినోత్సవం సందర్భంగా తీపికబురు
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. మహిళలకు కానుక ప్రకటించే అవకాశముంది

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో ఈ మసమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.
డ్వాక్రా మహిళలకు...
ఈ సమావేశంలో మహిళ దినోత్సవం సందర్భంగా కానుక ఇవ్వాలని నిర్ణయించారు. డ్వాక్రా మహిళలకు కొత్త పథకాన్ని ప్రకటించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే మహిళ దినోత్సవంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.
Next Story

