కేటీఆర్ పై సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రిత్విక్ కంపెనీకి 1660 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వర్కులకు సంబంధించి తనపై ఆరోపణ చేయడం మూర్ఖత్వమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కయి తాను కాంట్రాక్ట్ పొందానని కేటీఆర్ చేసిన ఆరోపణ పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ఇందులో తనకు సంబంధం లేదన్నసీఎం రమేష్ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి చెల్లెమ్మ షర్మిల తో పోరు ఉన్నట్టే తెలంగాణలో కేటీఆర్ కు కూడా చెల్లెలిపోరుతో పూర్తిగా మతిభ్రమించి మాట్లాడుతున్నావని అన్నారు. ప్రభుత్వం ఏదైనా కంపెనీలకు కాంట్రాక్ట్ పనులు ఇచ్చేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తారో పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన నీకు తెలియదా అని కేటీఆర్ ను సీఎం రమేష్ ప్రశ్నించారు. నాలుగు నెలల క్రితం ఢిల్లీలో నా ఇంటికి వచ్చిన నీవు మాట్లాడవో గుర్తుందా అని కేటీఆర్ ను నిలదీశారు. కావాలంటే నువ్వు వచ్చి వెళ్లిన సీసీటీవీ పుటేజి కూడా మీడియాకు పంపిస్తానన్న సీఎం రమేష్ మీ ప్రభుత్వంలో చేసిన అవినీతి బయటకు రాకుండా, కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బిజెపి పార్టీలో మీ పార్టీని కలపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పావని అవునా? కాదా? అని సీఎం రమేష్ ప్రశ్నించారు.

