Thu Jan 29 2026 23:02:39 GMT+0000 (Coordinated Universal Time)
Cheetah : ఆ చిరుతపులిని చంపేసింది వాళ్లేనా?
వేటగాళ్ల చేతికి చిక్కి ఒక చిరుత పులి చిక్కి మరణించిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

వేటగాళ్ల చేతికి చిక్కి ఒక చిరుత పులి చిక్కి మరణించిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. వేటగాళ్లు దాని పాదాలు, గోళ్లు, పళ్ల కోసం చిరుతపులిని చంపినట్లు స్పష్టంగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లా తాళ్లమడుగు అటవీ సమీపంలో ఒక చిరుతపులి కళేబరం కనిపించింది. కాళ్లు కూడా నరికి వేసి ఉండటంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.
పళ్లు, గోళ్లు, పాదాల కోసం...
పశువులు కాసే వ్యక్తి చిరుత పులి కళేబరాన్ని చూసి గ్రామస్థులకు తెలిపారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించారు. కాళ్లు నరికి వేసి ఉండటం, పళ్లు తొలగించి ఉండటంతో ఇది వేటగాళ్ల పనేనని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

