Fri Dec 05 2025 17:34:25 GMT+0000 (Coordinated Universal Time)
పాలకొల్లులో రైతుల మహాపాదయాత్ర
ప్రస్తుతం పాలకొల్లు నియోజకవర్గంలో అమరావతి రైతుల మహా యాత్ర జరుగుతుంది.

అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతుంది. 28వ రోజుకు మహాపాదయాత్ర చేరకుంది. ప్రస్తుతం పాలకొల్లు నియోజకవర్గంలో యాత్ర జరుగుతుంది. ఈరోజు పాలకొల్లులో యాత్ర ప్రారంభమై కవిటం వద్ద భోజనం విరామానికి రైతులు ఆగుతారు. అనంతరం బయలుదేరి పెనుగండ వరకూ పాదయాత్రను కొనసాగిస్తారు. ఈరోజు మొత్తం 14 కిలోమీటర్ల వరకూ పాదయాత్ర చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
భారీ బందోబస్తు...
అమరావతి రైతుల మహాపాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. వర్షంలోనూ యాత్రను రైతులు కొనసాగిస్తున్నారు. టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. దారిపొడవునా ప్రజలు వచ్చి వారికి స్వాగతం పలుకుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పాదయాత్ర గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

