Sat Jan 31 2026 05:52:11 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ... ఎంతంటే?
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కార్తీక సోమవారం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యల భక్తులు వేచి చూస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి భక్తులకు పదిహేను గంటల సమయం పడుతుంది. ఇప్పుడు క్యూ లైన్ లో ప్రవేశించే వారికి 18 గంటల సమయం పట్టే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేక దర్శనానికి....
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 85,131 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,188 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.47 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

