Fri May 23 2025 02:17:32 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ కి షాకిచ్చిన విశాఖ... కార్పొరేషన్ ను చేజార్చుకున్న ఫ్యాన్ పార్టీ
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో కూటమిదే పై చేయి అయింది

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో కూటమిదే పై చేయి అయింది. మేయర్ హరివెంకటకుమారి పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఉదయం పదకొండు గంటలకు సమావేశమైన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం కలెక్టర్ ఎంఎన్ హరింధర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. వైసీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా కూటమి పార్టీలోకి చేరుతున్నారు. వైసీపీ కార్పొరేటర్లు పార్టీని వీడటంతో వాటిని కూటమి బలం పెరిగింది.
74 మంది కార్పొరేటర్లు...
మొత్తం 97 కార్పొరేటర్లుండగా సమావేశానికి 74 మంది కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. దీంతో వారంతా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేశారు. కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించడంతో హరి వెంకట కుమారి తన పదవిని కోల్పోయారు. రేపు కొత్త మేయర్ ను కూటమి సభ్యులు ఎన్నుకునే అవకాశముంది.
Next Story