Wed Dec 17 2025 08:26:32 GMT+0000 (Coordinated Universal Time)
గుడివాడ ఏఎన్నార్ కళశాలకు నాగార్జున రెండు కోట్లు
అక్కినేని నాగార్జున గుడివాడ ఏఎన్నార్ కళాశాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు.

అక్కినేని నాగార్జున గుడివాడ ఏఎన్నార్ కళాశాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. అక్కినేని నాగేశ్వరరావు చదువుకోకపోయినా ఆయన పేరిట స్థాపించిన గుడివాడలోని ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవ కార్యక్రమంలో నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున కళాశాలలోని రూసా భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు.
1959లోనే...
ఈ కళాశాలకు 1959లోనే తన తండ్రి నాగేశ్వరరావు లక్ష రూపాయల విరాళం ఇచ్చారని నాగార్జున గుర్తు చేశారు. అయితే వజ్రోత్సవాల సందర్భంగా ఏఎన్నార్ కళాశాలలోని విద్యార్థుల స్కాలర్ షిప్ ల కోసం తమ కుటుంబం రెండు కోట్ల రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ విరాళంతో విద్యార్థులకు స్కాలర్ షిప్ లను అందించాలని కోరారు.
Next Story

