Thu Dec 18 2025 13:41:08 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కన్నా విందు సమావేశం
తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ జిల్లాలో తన పట్టుపెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు

తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ జిల్లాలో తన పట్టుపెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు టీడీపీ నేతలకు విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తొలిసారి కన్నా లక్ష్మీనారాయణ జిల్లాకు చెందిన పదిహేడు నియోజకవర్గాల ఇన్ఛార్జులను విందు సమావేశానికి ఆహ్వానించారు.
17 నియోజకవర్గాల...
దీంతో పార్టీలో చర్చనీయాంశమైంది. కన్నా విందు సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణాలపై పలు రకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. భవిష్యత్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి దక్కించుకోవడానికి ముందుగానే టీడీపీ నేతలను కన్నా లక్ష్మీనారాయణ మంచి చేసుకుంటున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇది పార్టీ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.
Next Story

