Fri Dec 05 2025 19:07:40 GMT+0000 (Coordinated Universal Time)
కార్యకర్తల కోసం మార్పులు చేసిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకారం గ్రీవెన్స్ కార్యక్రమంలో మార్పు చేశారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకారం గ్రీవెన్స్ కార్యక్రమంలో మార్పు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ లు ప్రతి బుధవారం నిర్వహించే గ్రీవెన్స్ ను ఎమ్మెల్యేల అభ్యర్ధన మేరకు శుక్రవారానికి మార్చే నిర్ణయం తీసుకున్నామని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కార్యకర్తల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణ, పార్టీ సంస్థాగత నిర్మాణం, వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని అభినందించడమే ఈ గ్రీవెన్స్ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం అని పల్లా శ్రీనివాసరావు వివరించారు.
కేంద్ర కార్యాలయానికి...
నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి సంస్థాగత పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఈ సమావేశానికి తప్పనిసరిగా ఆహ్వానించాలని ఆదేశాలు జారీ చేశారు. నియోజక వర్గాల్లో స్వీకరించిన వినతులను.. అలాగే పరిష్కరించిన వినతుల సంఖ్య తదుపరి వారం నివేదికను టీడీపీ కేంద్ర కార్యాలయానికి తెలిజేయాలని సూచించింది. సమావేశానికి హాజరైన, హాజరు కాని వారి వివరాలు, అలాగే సమావేశం యొక్క ముఖ్యమైన మినిట్స్ను కూడా కేంద్ర కార్యాలయానికి పంపించాలని కోరారు. కార్యకర్తల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
Next Story

