Fri Jan 30 2026 19:46:48 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు

తిరుమలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. మంగళవారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 18 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరికి స్వామి వారి దర్శనం 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఇప్పుడు వచ్చే వారికి ముప్ఫయి గంటల సమయం పట్టే అవకాశముందని తెలిపారు.
హుండీ ఆదాయం...
మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారాని 63,759 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,102 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.40 కోట్ల రూపాయలు అని అధికారులు తెలిపారు.
Next Story

