Fri Dec 05 2025 12:45:07 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కేంద్ర బృందం రాక
ఆంధ్రప్రదేశ్ లో సంభవించిన వరదల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది

ఆంధ్రప్రదేశ్ లో సంభవించిన వరదల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది. మూడు రోజుల పాటు నాలుగు జిల్లాల్లో పర్యటించనుంది. వరదల వల్ల దెబ్బతిన్న ఆస్తి నష్టంతో పాటు పంట నష్టం కూడా ఈ కేంద్ర బృందం అంచనా వేయనుంది. ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం అధికారుల బృందాన్ని పంట నష్టాన్ని అంచనా వేయడానికి పంపింది.
నాలుగు జిల్లాల్లో....
ఈరోజు కేంద్ర బృందం చిత్తూరు జిల్లాలో పర్యటించనుంది. ఈ నెల 13 నుంచ 20వ తేదీ వరకూ కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదల వల్ల ఎక్కువగా చిత్తూరు, కడప జిల్లాలు నష్టపోయాయి. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ బృందం ఏపీలో రెండు బృందాలుగా విడిపోయి మూడు రోజుల పాటు పర్యటించనుంది.
Next Story

