Tue Dec 23 2025 13:41:40 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్ర ప్రభుత్వం టీడీపీ నేతకు కీలక పదవి
కేంద్ర ప్రభుత్వం టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ కు కీలక పదవి కట్టబెట్టింది

కేంద్ర ప్రభుత్వం టీడీపీ నేతకు కీలక పదవి కట్టబెట్టింది. మాజీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఈ పదవిలో నియమితులయ్యారు. అదనపు సొలిసిటర్ జనరల్ గా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ నియమితులయ్యారు. సుప్రీంకోర్టులో కొత్తగా ఇద్దరు అదనపు సొలిసిటర్ జనర ల్ ను కేంద్రం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
అదనపు సోలిసిటర్ జనరల్ గా...
కనకమేడల రవీంద్రకుమార్ తో పాటు దవీందర్పాల్ సింగ్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదంతో న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. కనకమేడల గతంలో రాజ్యసభ సభ్యుడిగా టీడీపీ తరుపున వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయినా కనకమేడల ఒక్కరే పార్టీలో ఉన్నారు. మిగిలిన వారంతా బీజేపీలో చేరిపోయారు.
Next Story

