Fri Dec 05 2025 19:11:41 GMT+0000 (Coordinated Universal Time)
అసెంబ్లీ సమావేశాల చివరి రోజు టీడీపీ?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ ఆందోళన నిర్వహించింది

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ ఆందోళన నిర్వహించింది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కావడంతో నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సెక్రటేరియట్ అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకూ నిరసన ర్యాలీ చేపట్టింది. ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చిన మద్యనిషేధం గోవిందా అంటూ నినాదాలు చేశారు.
తాళిబొట్టు చేతిలో పట్టుకుని...
జంగారెడ్డిగూడెంలో 42 మంది నాటుసారా మరణాలపై చర్చ జరగాలని, దీనిపై న్యాయవిచారణ జరపాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. మృతుల ఫొటోలకు నివాళుర్పించారు. నల్లకండువాలు ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి ప్రభుత్వ హత్యలేనంటూ తాళిబొట్లు చేతిలో పట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. బాధిత కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
Next Story

