సినీ హీరోలపై టీడీపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

Update: 2018-03-20 07:52 GMT

తమిళనటులను చూసి బుద్ధి తెచ్చుకోవాలని, ప్రత్యేక హోదా విషయంలో టాలివుడ్ నటులు ఎందుకు ముందుకు రావడం లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమాన్ని ముందుండి నడిపించింది అక్కడి అగ్రనటులేనన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మన తెలుగునటులకు ఏమైందని ప్రశ్నించారు. తెలుగు ప్రజలు సినిమాలు చూడకపోతే మీరు ఎక్కడ ఉంటారన్నారు. హీరోయిన్ వెంట పడే క్యారెక్టర్లకే సినీ హీరోలు పనికొస్తారన్నారు. హోదా ఉద్యమానికి ఎందుకు మద్దతివ్వరన్నారు. తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, కవితకు ప్రతి విషయంలో మద్దతు పలుకుతున్న సినీ నటులు ఇక్కడ ప్రత్యేక హోదా కోసం ఎందుకు నినదించరన్నారు. ఏపీకి నిధులు రాకుంటే ఆందోళనకు దిగరా? ఏజ్ బార్ అయిన నటులూ మీకు ప్రజా ప్రయోజనాలు పట్టవా? అని నిలదీశారు. ప్రజల పక్షాన నిలబడేందుకు ముందుకు రాకుంటే మిమ్మల్ని వెలివేసేందుకు కూడా సిద్ధమని రాజేంద్రప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Similar News