బ్రేకింగ్ : సోము వీర్రాజు ఆఫీసు ముందు ఉద్రిక్తత...!

Update: 2018-02-05 06:51 GMT

సోము వీర్రాజు ఆఫీసు ముందు ఉద్రికత్త చోటు చేసుకుంది. రాజమండ్రిలోని ఆయన ఆఫీసు ముందు టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సోము వీర్రాజుపై బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ ఏజెంట్ గా సోము వీర్రాజు పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి సోము వీర్రాజు ప్రతిపక్షంవైపు నిలుస్తున్నారన్నారు. తామిచ్చిన పదవితో ఊరేగుతూ తమపైనే విమర్శలు చేస్తున్నారు. అయితే సోము వీర్రాజు కార్యాలయాన్ని ముట్టడిస్తున్నారని తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు కూడా ఎదురుదాడికి దిగారు. రాళ్ల దాడికి దిగారు. దీంతో రాజమండ్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు సోము వీర్రాజు ఇల్లు,కార్యాలయం ముందు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

Similar News