బ్రేకింగ్ :టీడీపీ కంటే ముందుగానే బీజేపీ మంత్రులు

Update: 2018-03-08 04:26 GMT

కేంద్ర ప్రభుత్వంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రులిద్దరూ రాజీనామా చేయకముందే... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మంత్రులిద్దరూ రాజీనామాలు చేశారు. మంత్రులు కామినేనిశ్రీనివాస్, మాణిక్యాలరావులు తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించారు. కేవలం రెండే నిమిషాలు సీఎం వద్ద ఇద్దరు మంత్రులున్నారు. బీజేఎల్పీ కార్యాయలంలో తొలుత సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాలు టీడీపీ కంటే ముందే సమర్పించాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసిన మంత్రులిద్దరినీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు ఆలింగనం చేసుకుని వారికి వీడ్కోలు పలికారు. బీజేపీపై చేస్తున్న ప్రచారం తమకు బాధ కలిగించిందని కామినేని, మాణిక్యాల రావు అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఎంట్రీ ఎంత బలంగా ఉంటుందో... ఎగ్జిట్ కూడా అలాగే ఉంటుందని కామినేని అన్నారు.

Similar News