బ్రేకింగ్ : ఐదో రోజూ అదే సీన్...రేపటికి వాయిదా

Update: 2018-03-22 06:39 GMT

ఐదో రోజూ అదే సీన్. మార్పు లేదు. వాయిదా అనంతరం 12గంటలకు ప్రారంభమయిన వెంటనే అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. మంత్రి అనంతకుమార్ తాము చర్చకు సిద్దమేనంటూ ఎప్పటిలాగానే ప్రకటించారు. సభను ఆర్డర్ లో ఉంచితే తాము చర్చకు సిద్ధమని అనంతకుమార్ ప్రకటించారు. ఆందోళనల మధ్యనే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభా కార్యక్రమాలను చేపట్టారు. కేంద్రప్రభుత్వంపై వైసీపీ, టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను సుమిత్రా మహాజన్ చదివి విన్పించారు. కాని సభలో గందరగోళం కొనసాగుతుండటంతో తాను అవిశ్వాసంపై చర్చ చేపట్టలేనని స్పీకర్ ప్రకటించారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటే తీర్మానంపై చర్చించే అవకాశముంటుందని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేశారు. తాను హెడ్ కౌంట్ చేయాలని స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని కోరారు. అయినా అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు శాంతించకపోవడంతో సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.

Similar News