పార్లమెంటు ఉభయ సభలూ ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్తోత్తరాలను ప్రారంభించారు. అయితే టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. టీఆర్ఎస్ రిజర్వేషన్లపైన, అన్నాడీఎంకే కావేరీ జలాలపైన ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తుండటంతో స్పీకర్ లోక్ సభను 12 గంటలకు వాయిదా వేశారు. దీంతో లోక్ సభ మళ్లీ 12 గంటలకు ప్రారంభం కానుంది.