బాబుకు బీజేపీ ఘాటు కౌంటర్

Update: 2018-03-24 13:01 GMT

టీడీపీపై బీజేపీ మాటల దాడిని పెంచింది. ఇక యుద్ధానికి సిద్ధమా అన్నట్లు ప్రశ్నిస్తుంది. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి ఇప్పట్లో తెరపడేట్లు కన్పించడం లేదు. అమిత్ షా లేఖకు చంద్రబాబు అసెంబ్లీ వేదికగా సమాధానమిచ్చారు. అమిత్ షా లేఖ తనను కాదని ఐదు కోట్ల ఆంధ్రులను రెచ్చగొట్టే విధంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనికి తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు కౌంటర్ ఇచ్చారు. నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ కు లక్షా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయాలు ఇచ్చామన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించలేదన్నారు. ఖర్చు చేసిందానికి లెక్కలూ చెప్పడం లేదన్నారు. లెక్కలు చెప్పకుండా నిధులు ఎలా విడుదలవుతాయని ఆయన ప్రశ్నించారు. తమపై బురదజల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా ఇక ముగిసిన అధ్యాయమేనని ఆయన చెప్పారు.

Similar News