బాబు కంటే ఎన్టీఆరే నయమా?... డిప్యూటీ సీఎం సెన్సేషన్ స్టేట్ మెంట్

Update: 2016-12-24 15:13 GMT

ఏపీ డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి కేఈ క్రిష్ణమూర్తి బాబుపై గుస్సా అయ్యారు. చంద్రబాబు కర్నూలు జిల్లా పనులపై నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్నారని చెప్పారు. కర్నూలులో ఆయన ఓ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ హయాంలో ఏదైనా పనులు వేగంగా జరిగేవని....కాని మా బాస్ మాత్రం ప్రతి పనికీ ఆలోచిస్తున్నారని కేఈ ఆవేదన చెందారు. కర్నూలు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఏడుగురు ముందుకు వస్తే పనులు మందకొడిగా సాగటం ఎందుకో అర్ధంకావటం లేదని అన్నారాయన. గతంలో కేఈ క్రిష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ కూడా టీడీపీపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. తర్వాత ఆయన క్షమాపణ చెప్పారు. ఇంతకీ బాబుపై కేఈ ఆగ్రహం ఎందుకో అర్ధం కావడం లేదు. పరిశ్రమల కోసమేనా? మరెందుకోసం.....

Similar News