పవన్ పై బాబు పరోక్ష సెటైర్లు

Update: 2018-03-15 13:36 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై పరోక్షంగా సెటైర్లు విసిరారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ కొంతమంది లాలూచీ పడి తనపై రాజకీయ విమర్శలు చేస్తున్నారని, వారికి రెండు, మూడు రోజుల్లో సమాధానం చెబుతానన్నారు. కేంద్రంపై తాను పోరాడుతుంది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనన్నారు. 29 సార్లు ఢిల్లీ తిరిగితే కొందరు ఎద్దేవా చేస్తున్నారని, కాని మిత్రపక్షంగా ఉండి తాను తిరిగింది ధర్మయుద్ధం కోసమనేనని ఆయన చెప్పారు. కేంద్రంపై తాను పోరాడుతుంటూ తనను బలపర్చకుండా బలహీనపర్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. నిప్పుతో చెలగాటం మంచిది కాదని చంద్రబాబు హితవు పలికారు. దేశం, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని గుర్తించాలన్నారు. అది ఏ పార్టీ అయినా కావచ్చని, ఏ వ్యక్తులైనా కావచ్చన్నారు. తన రాజకీయ అనుభవంలో ఎన్నో ఒడిదుడుకులు చూశానన్నారు. నలభై ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎన్నో రాజకీయాలు చూశానని, ఎంతమందో లాలూచీ పడటాన్ని చూశానన్నారు. మనుషులు ముఖ్యంకాదని, ప్రజల మనోభావాలు ముఖ్యమన్నారు.

Similar News