నేటి నుంచి నేరుగా ఇంటికే

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి నేరుగా ఇంటికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. గ్రామీణ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఈ పింఛన్లను పంపిణీ చేయనున్నారు. మొత్తం 6.11 లక్షల [more]

Update: 2020-02-01 03:22 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి నేరుగా ఇంటికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. గ్రామీణ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఈ పింఛన్లను పంపిణీ చేయనున్నారు. మొత్తం 6.11 లక్షల మంది లబ్దిదారులకు ఈ పింఛన్లు గ్రామీణ వాలంటీర్లు నేరుగా ఇంటికి వెళ్లి పింఛన్లు అందచేయనున్నారు. వాలంటీర్లకు ఇచ్చిన స్మార్ట్ ఫోన్ల ద్వారా లబ్దిదారులకు పింఛన్లు అందజేయనున్నారు. వాలంటీర్ల వ్యవస్థను వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ పింఛన్ల కోసం లబ్దిదారులు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారు. కానీ నేటి నుంచి లబ్దిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నారు.

Tags:    

Similar News