తెలుగుదేశం 35వ ఆవిర్భావ వేడుకలు !

Update: 2016-03-29 14:16 GMT

తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవం సందర్భ ంగా మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పలు కార్యక్రమాలు నిర్వహించేందు కు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగం మంగళవారం ఉదయం 8గంటలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పలువురు పార్టీ నేతలతో కలిసి ఉదయం 8.30 గంటలకు చంద్రబాబు ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు, దివంగత నేత నందమూరి తారకరామారావు కు నివాళులర్పిస్తారు. సాయంత్రం 5 గంటలకు పార్టీ ఆవిర్భావ సభ నిర్వహిం చనున్నారు. అలాగే అన్ని జిల్లాలలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ అధిష్టానవర్గం జిల్లా నియోజకవర్గ, మండల బాధ్యులను ఆదేశించింది. కొన్ని జిల్లాలలో అన్నదాన కార్యక్రమంతో పాటు పేద రోగులకు పండ్లు పంపిణీ చేయనున్నారు.

Similar News