అస్సాం రాష్ట్రంలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరయ్యారు. ఆమెకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ స్వాగతం పలికారు. అంగురి నియోజకవర్గం నుంచి అంకిత కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా అంగురిలో ఏర్పాటు చేసిన ర్యాలీలో సోనియాగాంధీ పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం అస్సామీ సంప్రదాయ టోపీని ఆమెకు బహుకరించారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 4, 11 తేదీల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది.